Tuesday, May 7, 2024

తీరంగ్ యాత్రలో డి కె అరుణ…ఇళ్ల‌పై జాతీయ ప‌త‌కాలు ఎగుర‌వేయాల‌ని పిలుపు

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) . జోగులాంబ గద్వాల జిల్లా: మేరే మాటి మేరే దేశ్ కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తీరంగ్ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డికె. బంగ్లా నుండి ప్రారంభమై వైఎస్సార్ చౌక్, కృష్ణ వేణి చౌక్, అంబేద్కర్ చౌక్, కృష్ణ రెడ్డి బంగ్లా నుంచి కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ పాల్గొని తీరంగ్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తీరంగ్ యాత్ర కార్యక్రమం గద్వాల జిల్లాలో నిర్వహించామని అన్నారు. భారత దేశం ఐక్యతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల పై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, బిజెపి నాయకులు కబీర్దాస్ నర్సింహులు, శ్రీనివాస్ గౌడ్, నెమలికంటి నరసింహులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, జమ్మిచేడు ఆనంద్, భాస్కర్ యాదవ్, కరాటే సత్యం, మెడికల్ ఇసాక్, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement