Tuesday, May 7, 2024

రహదారిపై పెద్దపులి సంచారం.. వాహనదారుల్లో భయం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో ఉన్న కొండపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. సలుగుపల్లి, లోడ్ పల్లి మధ్య ప్రధాన రహదారిపై పెద్దపులి నడుచుకుంటూ కనిపించింది. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలోని రహదారులపై వాహనదారులకు పెద్దపులి కనిపించినట్లు గ్రామస్తులు చెప్పారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. పెద్దపులి సంచరిస్తున్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులి సంచారంతో పెంచికల్ పేట కొండపల్లి మద్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండిః పటేల్ స్టేడియానికి మోదీ పేరెందుకు ?: బీజేపీకి రేవంత్‌ ప్రశ్న

Advertisement

తాజా వార్తలు

Advertisement