Thursday, April 25, 2024

పెద్దపులి సంచారం..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్‌పేట మండలంలో ఉన్న కొండపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలోని రహదారులపై వాహనదారులకు పెద్దపులి కనిపించింది. దీంతో విషయాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. ఈ నేపథ్యంలో కొండపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బెజ్జూరు, పెంచికల్‌పేట శివార్లలో గత కొన్నిరోజులుగా పెద్దపులి సంచరిస్తున్నది. ఈ నెల14న తెల్లవారుజామున లోడ్‌పల్లి బీట్‌ పరిధిలో ఆవుల మందపై పులి దాడి చేసింది. దీంతో మందలోని ఓ ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి:క్లీవేజ్ షోతో వాణీ కపూర్..పిక్స్ వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement