Sunday, April 28, 2024

TS: ఈసారి కూడా క‌ర్రుగాల్చి.. వాత‌పెట్ట‌డం ఖాయం.. పొంగులేటి

బిజెపి,బిఆర్ఎస్ ల‌పై మండిప‌డ్డ పొంగులేటి
మేడిగడ్డ పొంగి కొట్టుకుపోతున్నా ప‌ట్టించుకోలేదు
రైత‌ల‌న్న‌ల‌ను బిఆర్ఎస్ నేత‌ల రెచ్చ‌గొడుతున్నారు
సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం ..

వైరా – ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు.. సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టార‌న్నారు. కాలేశ్వరం మహా ప్రాజెక్టు అంటూ రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ నేత‌లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగ‌డ్డ పొంగి కొట్టుకొనిపోతున్నా కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వల్ల కరువు రాలేదు.. బీఆర్ఎస్ పరిపాలన వల్లే కరువు వచ్చిందని మండిపడ్డారు. సాగు, తాగునీటికి కరువు వచ్చిందని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. లోక్ స‌భ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటుగా బీ టీమ్ బీజేపీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement