Saturday, April 27, 2024

సాత్విక్ కేసులో క‌మిటీ రిపోర్ట్ ఇదే..

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇటీవల కలకలం రేపిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ సూసైడ్‌ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్‌ అనే విద్యార్థి… టార్చర్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హైదరాబాద్ నర్సింగ్ శ్రీ చైతన్య కాలేజీపై ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చింది. సాత్విక్ మృతిపై విచారణ జరిపిన విద్యాశాఖ… ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది కమిటీ. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని తెలిపిన కమిటీ…కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. సాత్విక్ అడ్మిషన్ ఈ కాలేజీలో లేదని గుర్తించిన కమిటీ… మరో కాలేజీలో అడ్మిషన్ తీసుకొని, ఇక్కడ చదువుతున్నాడని వెల్లడించింది. ర్యాగింగ్ లాంటి వాటిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement