Thursday, May 16, 2024

ఎల్బీన‌గ‌ర్ లో మ‌హిళ‌పై థ‌ర్డ్ డిగ్రీ … ఎస్ ఐ ర‌వికుమార్ బ‌దిలీ..

నాగోల్ అగస్టు 20 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ థర్డ్ డిగ్రీ ఘటన లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కె.రవికుమార్ ను పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓ గిరిజన మహిళ వరలక్ష్మి ని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. విచారణ చేసిన కమిషనర్ దేవేందర్ సింగ్ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement