Monday, April 29, 2024

TS: ఏటీఎంకు కన్నం.. రూ.25ల‌క్ష‌ల‌తో ఉడాయించిన‌ దొంగలు..

ఏటీఎంకు కన్నం వేసి రూ.25లక్షలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రుద్రూర్ మండల పరిధిలో గల బస్టాండ్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి ఆగంతకులు చొరబడి బీభత్సం సృష్టించారు.

అనంతరం ఏటీఎంను చాకచక్యంగా పగులగొట్టి అందులో ఉన్న దాదాపు రూ.25 లక్షలను ఎత్తుకుని అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement