Monday, April 29, 2024

TS : క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ దంపతుల ప్రత్యేక పూజలు

చెన్నూర్ ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు గురువారం నియోజక వర్గ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలుపొందిన నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించలేదు.

ఇవాళ‌ ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి సమావేశం నిర్వహించనున్నారు. నియోజక వర్గంలోని నాయకులు కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం చేరుకోవడంతో క్యాంప్ కార్యాలయం నాయకులతో కొత్త శోభ సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement