Sunday, April 28, 2024

TS : విద్యుత్ షాక్​తో యువ రైతు మృతి

తాంసి, మార్చి 14(ప్రభన్యూస్): విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి చెందిన ఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువ రైతు మల్లెల అక్షయ్ (29) ఉదయం తన పంట చెనులో వేసిన జొన్న పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించేందుకు విద్యుత్ తీగల అమర్చాడు.

- Advertisement -

గురువారం ఉదయం తన పంట పొలంలోకి వెళ్లే క్రమంలో విద్యుత్ తీగలు అమర్చిన విషయాన్ని మరిచి పోయిన అక్షయ్ అకస్మాత్తుగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement