Wednesday, May 15, 2024

10 గంటల్లోనే దొంగను పట్టుకున్న శంకరపల్లి పోలీసులు

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ ఫతేపూర్ లో జరిగిన హత్యాయత్నం, దొంగతనం కేసును 10 గంటల్లో చేదించారు శంకరపల్లి పోలీసులు. బుధవారం నార్సింగ్ ఏసిపి లక్ష్మీనారాయణ శంకరపల్లి CI వినాయక్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలో ఫతేపురం కు చెందిన బాలమ్మ ఒంటరిగా ఉంటుంది. షాబాద్ మండలం దోసాడ గ్రామానికి చెందిన శంకరయ్య ఆమె ఇంట్లోకి అర్ధరాత్రి రెండు గంటలకు వెళ్లి తెల్లారింది డోర్ తెరవమని అడగగా ఆమె డోర్ తెరిచింది. ఇంట్లోకి ప్రవేశించి ఆమె చాతి భాగంపై కూర్చొని ముఖంపై దిండును గట్టిగా అదిమిపట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందనుకుని చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, 5 వేల నగదు దోపిడీ చేసి పారిపోయాడు, పోలీసులు CC కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకొని రిమాండ్ కు పంపారు.

పది గంటల్లోనే దొంగను ఛేదించి పట్టుకోవడంలో సఫలం చెందిన శంకర్ పల్లి పోలీసులను అందరూ అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement