Tuesday, May 14, 2024

Siddipet : రోకలితో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కొడుకు తండ్రిని రోకలితో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని నంగునూరు మండలం ఘనపూర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement