Friday, May 3, 2024

Murder : కట్నం కోసం అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు

హన్మకొండ : సొంత అత్తను గన్ తో కానిస్టేబుల్ కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ
ఘటన హన్మకొండలో సంచలనంగా మారింది. నిందితుడిని కానిస్టేబుల్ ప్రసాద్ గా గుర్తించారు.
మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కొత్తకోట పోలీస్
స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతురాలిని కమలమ్మగా గుర్తించారు. కానిస్టేబుల్ పై మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

దీంతో ఆయనను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా కానిస్టేబుల్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. రూ.4లక్షల విషయంలో అత్త అల్లుడి మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం మంచిర్యాల నుంచి భార్యతో కలిసి గుండ్ల సింగారంకు వచ్చిన ప్రసాద్.. అత్తతో మాట్లాడుతున్న క్రమంలో గన్ తో ఛాతిలో కాల్పులు జరిపాడు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కాల్పులు జరిపి అక్కడే
నిలబడిన కానిస్టేబుల్ పై మృతురాలి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement