Sunday, May 5, 2024

TS: కాంగ్రెస్ ఇచ్చిన‌ హామీల‌కు.. బ‌డ్జెట్ కు పొంత‌నే లేదు.. : బండి సంజయ్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు పొంతనే లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా బీసీలను మోసం చేసిందన్నారు.

అలాగే బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారని.. వారు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరం అని బండి చెప్పుకొచ్చారు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఇచ్చిన హామీలు నెరవేర్చలేమని.. కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement