Sunday, April 28, 2024

Expire Cadbury – డెయిరీ మిల్క్​ చాక్లెట్​లో పురుగు … మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం

అమీర్​పేట్​ ఇంటర్​ చేంజ్​ మాల్​లో కొనుగోలు
బిల్​తోపాటు ట్విట్టర్​లో పోస్టు
సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామన్న జీహెచ్​ఎంసీ
ఆహార భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ

హైదరాబాద్​ మెట్రో స్టేషన్లలో బిజీగా ఉండే ఇంటర్​చేంజ్​ స్టేషన్ అది. అమీర్​పేట మెట్రో స్టేషన్​ అంటే అతి పెద్ద జంక్షన్​గా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండ్​, బ్లూ లైన్స్​ మెట్రోలో ప్రయాణించేవారు అక్కడే మారుతుంటారు. రాకపోకలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అయితే.. ఇక్కడ ఉన్న మాల్స్​, షాపింగ్​ ఏరియాలపై అధికారులు ఫోకస్​ పెట్టడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని చాలామంది ట్విట్టర్​ (ఎక్స్​) ద్వారా తమ అనుభవాలను షేర్​ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి ఈ మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్​ని ఎగ్జాంపుల్​గా చూడొచ్చు..

రాబిన్​ ​ అనే ప్రయాణికుడు అమీర్​పేట్​ మెట్రో ఇంటర్​ చేంజ్​లో ఉన్న రత్నదీప్​ స్టోర్​ నుంచి ఒక డెయిరీ మిల్స్​ చాక్లెట్​ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్​ చేస్తే పురుగులు కనిపించాయి. దీంతో అతను దాన్ని వీడియో, ఫొటోలు తీసి ట్విట్టర్​లో షేర్​ చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని జీహెచ్​ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా.. ట్విట్టర్​లో తన ఎక్స్​పీరియన్స్​ని షేర్​ చేశాడు. ఇప్పుడిది పెద్ద ఎత్తున వైరల్​ అవుతోంది.

గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్​ ట్విట్టర్​లో ప్రశ్నించాడు. హైదరాబాద్‌లోని మెట్రో ఇంటర్‌చేంజ్ స్టేషన్ అమీర్​పేట్​లోని రత్నదీప్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్​ బిల్లు ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనిపై రిప్లయ్​ కోసం GHMCని ట్యాగ్ చేశాడు. అతని ఫిర్యాదుతో GHMC తక్షణమే గుర్తించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆహార భద్రతా బృందాన్ని ఆదేశించింది.

నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్​..
ఈ వీడియో, ఫొటోలను చూసిన చాలామంది ట్విట్టర్​ (ఎక్స్​) నెటిజన్లు సీరియస్​గా స్పందిస్తున్నారు. మెట్రో స్టేషన్స్​, మాల్స్​, ఎయిర్​పోర్ట్​ మాల్స్​లోనూ తమకు ఎదురైన అనుభవాలను షేర్​ చేసుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాలని అధికారులను డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement