Saturday, April 27, 2024

MBNR: కాంగ్రెస్ పార్టీ తీరువల్లే ప్రాజెక్టులు పూర్తి కాలేదు… ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూల్, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ తీరువల్లే ప్రాజెక్టులు పూర్తి కాలేదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పదవి ఇవ్వలేదని స్వప్రయోజనాల కోసం పార్టీ మారే జూపల్లి కృష్ణారావు పాలమూరు ప్రాజెక్టు సందర్శించడం ఏంటని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.

మంత్రి పదవి ఇచ్చారని కేసీఆర్ ని దేవుడన్నారు, పదవి ఇవ్వలేదని దెయ్యం అనడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులను కాల్చారు.. కేసులు వేశారే తప్ప వారి బాగోగులు ఎన్నడైనా చూశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు కేసు వేయడం వల్లే పాలమూరు – రంగారెడ్డి ఆలస్యమైందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజల క్షేమం కోరాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, ఎంపీపీ నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు యార రమేష్, సర్పంచ్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement