Monday, April 29, 2024

President : ముగిసిన రాష్ట్రపతి పర్యటన.. విమానాశ్రయంలో గవర్నర్, సీఎం వీడ్కోలు..

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల సెలవుల కోసం ఈనెల 18న రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. గత రాత్రి బొల్లార్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ ఉదయం హకీంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement