Thursday, May 23, 2024

ఆర్టీసీ బ‌స్సు చార్జీల పెంపునకు రంగం సిద్ధం

నిజామాబాద్‌ అర్బన్‌, (ప్రభ న్యూస్‌) : తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం అయ్యింది. సీఎం కేసీఆర్‌ అనుమతి లభించిన వెంటనే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. ఆర్టీసీ చార్జీల పెంపుపై సమావేశం ముగిసింది. సమావేశానంతరం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మీడియాతో మాట్లాడారు. చార్జీలు పెంచక తప్పని ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్నారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌కు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తున్నామని వెల్ల‌డించారు.

ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌. డీజిల్‌ ధరలు భారీగా పెంచడం వల్లే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్సప్రెస్‌ సర్వీసులకు కిలోమీటర్‌కు 30 పైసలు, సిటీ, ఆర్డినరీ బస్సులకు కిలోమీటరకు 25 పైసలు, మెట్రో డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌ ఆవెూదం తర్వాత అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement