Saturday, May 4, 2024

NLG: బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వద్ద దారుణం చోటుచేసుకుంది. సోమవారం ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా.. ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement