Sunday, April 28, 2024

AP: ఎంపీ బాలశౌరి ఓ బ‌ఫూన్ … అంబ‌టి

అమ‌రావ‌తి – తమ పార్టీలో టికెట్ కోల్పోయిన బఫూన్స్ వేరే పార్టీలోకి వెళ్లి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబ‌టి రాంబాబు. వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒక బఫూన్ అని సీరియస్ కామెంట్ చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… చంద్రబాబు లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండబోరని అన్నారు. కావాలనే కుట్ర పూరితంగా హామీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని గుర్తుచేశారు.

కాగా, బాలశౌరి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ బయటపెడుతామని అంబ‌టి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలశౌరి ఎవరికైనా నమ్మక ద్రోహం చేయగలడు అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇక రాజకీయాల్లో కనిపించర‌ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మునిగిపోయే నావతో చేతులు కలిపాడని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న వాళ్లను పవన్ కల్యాణ్ నట్టేట ముంచుతున్నార‌ని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement