Wednesday, May 1, 2024

పల్టీలు కొట్టిన కారు.. డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్రగాయాలు

సదాశివపేట రూరల్ : సదాశివపేట మండలంలోని బైపాస్ లో హైవే పైన ఈ ఉదయం కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంన్కెపల్లి చౌరస్తా వద్ద జరిగింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

జహీరాబాద్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎం.హెచ్02c1823 నెంబర్ గల కారు అతివేగం కారణంగానే కారు డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సంఘటన స్థలంలో మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement