Saturday, April 27, 2024

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయం : కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో, కుత్బుల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గ‌ల‌ సాయిబాబా నగర్ లో, కృషి కాలనీ పుస్పగిరి బస్తీల్లో కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసున్నారు. అనంతరం ముఖ్య నాయకులతో సమావేశమై భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పలు విషయాలను చర్చించారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసి…ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు. ఇకపై నియోజకవర్గం మొత్తం ఎలాంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని కూన శ్రీశైలం గౌడ్ కోరారు.

నిత్యం ప్రజలకు సేవ చేయడానికే భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. త‌మ‌ కార్యకర్తలందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా… వారికి అండగా ఉంటానని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎంఎస్ వాసు, డివిజన్ అధ్యక్షుడు కంది శ్రీరాములు, ఇన్ ఛార్జ్ గరిగే శేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి భీమ్ రాజు, మల్లేష్, మైనార్టీ అధ్యక్షుడు అజీజ్, బస్తీ నాయకులు బైరేష్ గౌడ్ సత్తిరెడ్డి, ప్రభాకర్, గణేష్, కిషోర్, భాస్కర్ రెడ్డి, చాంద్ పాషా, రాజు, రాజేష్ వర్మ, ఫణి, సత్యనారాయణ, రాజు, వెంకట్ రాజు, ప్రసాద్, పలువురు నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement