Friday, April 26, 2024

టెస్ట్ మ్యాచ్.. టీమిండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 69/0

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో రోజు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూపింది. కేవ‌లం 62 ప‌రుగుల‌కు న్యూజిలాండ్‌ను క‌ట్ట‌డి చేశారు బౌల‌ర్లు. భార‌త బౌల‌ర్ల ధాటికి న్యూజిలాండ్ టాపార్డ‌ర్‌తోపాటు మిడిలార్డర్ కూడా నిల‌దొక్కుకోలేదు. దీంతో 62 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ ముగించారు. కాగా, ఆ వెంట‌నే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఇండియా.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 69 ప‌రుగులు చేసింది.

ఇండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 325 + సెకండ్ ఇన్నింగ్స్‌లో 69 ప‌రుగులు చేసి 394 ప‌రుగుల‌తో జోరుమీదుంది. కాగా 332 ప‌రుగుల లీడింగ్‌లో ఉంది. మ‌యాంక్ అగ‌ర్వాల్ (38) పుజారా (29) ప‌రుగులు చేసి నైట్ వాచ్‌మ‌న్లుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement