Monday, April 29, 2024

NZB: లారీ బోల్తా …. రూ.4లక్షల విలువైన టమోటాలు నేలపాలు

బిక్కనూర్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్ల లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న టమోటాలు నేలపాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలో గల 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న టమోటాలు నేలపాలు కావడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం నుండి టమోటాల లోటుతో లారీ న్యూఢిల్లీకి వెళ్తుంది. బస్వాపూర్ గ్రామానికి రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం వల్ల రోడ్డు కింద బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న టమోటాలు నేలపాలయ్యాయి. లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement