Wednesday, May 22, 2024

Crime: భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన భర్త..

తలకొండపల్లి: భార్యను కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని సంగాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంతారం కలమ్మ (45) అనే మహిళను భర్త రాములు బుధవారం రాత్రి ఇంట్లో అతి దారుణంగా విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.

ఈ భార్యాభర్తలు గత 20సంవత్సరాలుగా హైదరాబాదులో తాపీపని చేసుకుంటూ జీవనం కొనసాగించగా.. 2 సంవత్సరాల నుండి స్వగ్రామానికి వచ్చి తాపీ పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పెళ్లిళ్లు అయ్యాయి. భార్యను అతి దారుణంగా హత్య చేయడంతో గ్రామస్తులు అంతా భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై వెంకటేష్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాములును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement