Tuesday, May 14, 2024

ఎరుకల కృష్ణ గౌడ్ మృతి బాధాకరం.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, జులై 21 (ప్రభ న్యూస్) : కర్మన్ ఘాట్ గ్రామస్థుడు, వృద్ధ రాజకీయ నాయకులు ఎరుకల క్రిష్ణ గౌడ్ అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కర్మన్ ఘాట్ లోని ఆయన నివాసంలో ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక బారాస సీనియర్ నాయకులు నల్ల రఘుమా రెడ్డితో కలిసి భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో చంపాపేట్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి, గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, గోగి రెడ్డి అంజిరెడ్డి, ఉమా మహేశ్వర్, చీర శీను, చేగొని మల్లేష్ గౌడ్, గోపాల్ ముదిరాజ్, నిష్కాంత్ రెడ్డి, గౌర శీను, జగదీష్, శివ గౌడ్, జయ ప్రకాష్ రెడ్డి, చందు యాదవ్, గోగు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రెడ్డి, చీర తిరుమలేష్, రాజు, నరేష్, బాల క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement