Sunday, April 28, 2024

TS: కార్పొరేట్ బిడ్డకు… కార్మిక బిడ్డకు మధ్య పోటీ… కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కార్మిక బిడ్డకు.. కార్పోరేట్ బిడ్డకు మద్య పోటీ జరగనుందని బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందన్నారు.

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఛీ కొడుతున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంట్ కు పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వేల కోట్ల రూపాయల అభ్యర్థితో నిరుపేదనైన తాను త‌లపడుతున్నానని ప్రజలు తనకు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, నాయకులు మేకల మల్లేశంతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement