Sunday, May 5, 2024

Breaking: బైక్‌ను గుద్దిన కారు.. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తుంటే ఒకరి మృతి

గణపురం (ప్రభ న్యూస్): బైక్‌ను కారు గుద్దిన ఘ‌ట‌న‌లో ఒక‌రు స్పాట్ డెడ్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఇవ్వాల ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మైలారం శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బొచ్చు శంకర్ (45) తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చ‌నిపోయాడు. మృతుడికి భార్య వజ్ర, ఇద్దరు కుమారులున్నార‌ని, కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement