Tuesday, May 7, 2024

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం


ఓ కాలువ‌లో గుర్తు తెలియ‌ని మ‌హిళ శవం ల‌భ్య‌మైంది. ఈ రోజు సుమారు ఉదయం 12 గం.ల సమయంలో వచ్చిన సమాచారం మేరకు హైద‌రాబాద్ న‌గ‌రంలోని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ ప‌రిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ సమీపంలో గల కాలువలో ఒక మృతదేహం తెలియాడుతూ క‌నిపించింది. అక్కడికి వెళ్లి ఆ మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఒక గుర్తు తెలియని మహిళ, సుమారు 30-35 సం.ల వయస్సు ఉండొచ్చు. అయితే ఆ మ‌హిళ బ్లాక్ టీషర్ట్, తెలుపు గీత‌ల ప్యాంట్ ధ‌రించి, కాళ్ల‌కు మెట్టెలు, చేతికి రెండు ఆకుప‌చ్చ‌ని గాజులున్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి మృత‌దేహాన్ని ఓజీహెచ్ కు త‌ర‌లించారు. మ‌హిళ‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement