Thursday, April 25, 2024

Ranga Reddy: కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులగా టిఆర్ఎస్ తరపున మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత శంబిపూర్ రాజు నామినేషన్ల దాఖలు చేశారు. అయితే ఎంపిటిసిల సంఘం తరపున ఇండిపెండెంట్ లుగా సంఘం నాయకులు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న ఆగంతకులు.. వారి నామినేషన్ పత్రాలు చించివేశారు. దీంతో తమ నామినేషన్ పత్రాలను పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు చించివేసారని ఎంపిటిసి సంఘం నాయకులు ఆందోళన చేశారు. పోలీసులు సైతం కలెక్టర్ కార్యాలయంలోనికి వారిని అనుమతించకపోవడంతో వందలాది మంది రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement