Thursday, May 2, 2024

Tension – బిజెపి కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి ఇంటి ముట్ట‌డి – బిజెపి ., బిఆర్ఎస్ ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

కర్మన్ ఘాట్ ఆగస్ట్ 25 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి పై చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కు నిరసనగా కర్మన్ ఘాట్లోని కార్పొరేటర్ ఇంటిని బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు.. ఈ సంద‌ర్ంగా బిఆఆర్ ఎస్,బిజెపి కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని బోరాసానేతలు డిమాండ్ చేయగా దానికి వ్యతిరేకంగా బిజెపి నేతలు బిజెపి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో బారాసకు చెందిన ఇరువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఇరువ‌ర్గాల‌ను అక్క‌డి నుంచి పంపివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement