Sunday, April 28, 2024

TS Assembly : అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధన ఉందని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్ల వద్ద ఆగిపోయారు. కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభలో అవకాశం ఇవ్వరు.. మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇనుప కంచెలు తీసివేశామన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకు అన్నారు. అనుమతి ఇస్తారా ? కంచెలు బద్దలు కొట్టాలా ? అని మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు నొక్కడం, ఇక్కడా కూడా గొంతు నొక్కడమేనా ? అని ప్రశ్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement