Friday, May 3, 2024

నీళ్లు తాగుతున్న నందీశ్వ‌రుడు .. చూసేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం

ఆసిఫ్ నగర్ దైబాగ్ శివాలయంలో వింత చోటుచేసుకుంది. శివాలయంలోని నందీశ్వరుడు నిళ్ళు తాగుతున్నాడని తెలిసి భ‌క్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆసిఫ్ నగర్ లోని చిన్న దైబాగ్ శివాలయంలో నందీశ్వరుడు ఆలయంలోని పూజారి పూజలు చేస్తూ ఉండగా నోటివద్ద నీళ్ళు పెట్టడంతో తాగడం గమనించి పూజారితో అశ్చ‌ర్యానికి గురయ్యాడు.. నీళ్ళుతాగడం గమనించిన భక్తులు ఈ విషయం ఆనోటా ఈ నోటా తెలియడంతో నందీశ్వరుడు నీళ్ళు తాగడం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అలయం వద్దకు క్యూ కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement