Thursday, April 25, 2024

ఇవాళ‌, రేపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు

బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అధ్య‌క్ష‌తన ఆపార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాలు హైద‌రాబాద్ లోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో జ‌ర‌గ‌న‌నున్నాయి. ఈస‌మావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, జాతీయ సహా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శివ ప్రకాష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నాయకులు రాజాసింగ్ తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన‌నున్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి పై బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులపై మాట్లాడనున్నారు. అలాగే రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య, దళిత సమస్యలు, గిరిజనుల సమస్యలు, కార్మికుల సమస్యలపై చర్చించే అవ‌కాశముంది. అలాగే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలకు వ్య‌తిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేయ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement