Friday, March 29, 2024

మానకొండూరు ప్రమాదంపై బండి సంజయ్ విచారం

కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల బాలాజీ శ్రీధర్, హిందూరి జలంధర్ మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో నివాసం ఉంటూ, సిరిసిల్ల పంచాయతీరాజ్ ఈ.ఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు, అడ్వకేట్ గా పనిచేస్తున్న బాలాజీ శ్రీధర్ ఇరువురు అన్నదమ్ములు అకాల మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పెంచాల సుధాకర్ రావు ఆరోగ్యపరిస్థితిపై ఎంపీ వాకబు చేసి ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement