Saturday, April 27, 2024

ప్రత్యక్ష విచారణకు హైకోర్టు నిర్ణయం.. వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే అనుమతి

ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రత్యక్ష విచారణ జరుగనుంది. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతాయని హైకోర్టు పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఉంటుందని హైకోర్టు తెలిపింది. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ కొనసాగనుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement