Saturday, April 27, 2024

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే…

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా, 621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 691 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.  అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 67, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కేసులు గుర్తించారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,44,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం 6,32,080 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 9,069 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మరణాల సంఖ్య 3,802కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement