Sunday, April 28, 2024

తీన్మార్‌ మల్లన్నకు బిగ్ రిలీఫ్.. బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

ఓ వ్యాపారిని బెరించిన కేసులో అరెస్ట్ అయిన Q న్యూస్ అధినేత తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ కు ఎట్ట‌కేల‌కు బెయిల్ లభించింది. మలన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో రిమాండ్‌లో ఉంటోన్న విష‌యం తెలిసిందే. ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు ప‌లు కేసులు మల్లన్నపై న‌మోద‌య్యాయి. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్రంలోని ప‌లు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్ప‌టి నుంచి జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం ఆయ‌న ఇంత‌కు ముందు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement