Thursday, May 2, 2024

ఇంటర్ పరీక్షల ఎవాల్యువేష‌న్.. డేట్ రిలీజ్ చేసిన స్టేట్‌ బోర్డ్‌..

హైదరాబాద్‌,(ప్రభ న్యూస్‌): ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల స్పాట్‌ మూల్యాంకనానికి తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులను జారీ చేసింది. 6 నుంచి ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం. ఈ మేరకు బోర్డు సెక్రటరీ షేద్‌ ఒమర్‌ జలీల్‌ ప్రకటన విడుదల చేశారు. మూల్యాంకనానికి అవసరమైన సిబ్బంది జాబితాను సిద్ధం చేశారు. జాబితాలోని వారు, వారి సంబంధిత మూల్యాంకన కేంద్రాల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. జాబితాలో ఉన్న వారిని మూల్యాంకన తేదీల్లో వారి విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు, ప్రిన్సిపల్‌లకు ఆదేశాలను జారీ చేశారు. ఉత్తర్వులను ఉల్లంగించే యాజమాన్యాలు, వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement