Monday, April 29, 2024

ఎల్ఆర్ఎస్ పై సుప్రీం తీర్పే ఫైనల్:రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిన హైకోర్టు..

సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టులో తేలే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అనధికార లేఅవుట్ లు, భవనాల క్రమబద్ధీకరణ పై హైకోర్టులో విచారణ చేపట్టిన సందర్భంగా ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున తాము విచారణ జరపాల్సిన అవసరం లేదన్న హైకోర్టు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై దాఖలైన పిటిషన్లన్నింటిపై విచారణ ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement