Saturday, May 18, 2024

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు నోటీసులు

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. కేయూ, తెలుగు యూనివర్సిటీలకు వీసీల నియామకంపై హైకోర్టులో విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్‌ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీసీల నియామకం జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. కేయూ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్ తరుపున లాయర్ వాదనలు వినిపించారు. తెలుగు వర్సిటీ వీసీకి 70 ఏళ్లు దాటాయని తెలిపారు.

దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, యూజీసీకి హైకోర్టు ఆదేశించింది. కేయూ వీసీ రమేష్‌, తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావుకు హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement