Saturday, April 27, 2024

Breaking: తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు..

హైదరాబాద్‌: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌ నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొంది.

పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ రద్దైంది. సరైన నిబంధనలు పాటించలేదని రెండో సారి జరిగిన ప్రిలిమ్స్ ను హైకోర్టు రద్దు చేసింది. ఇటీవల 60 గ్రూప్-1 పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement