Sunday, April 28, 2024

TS : నేటి నుంచి తెలంగాణ అమ‌ర్‌నాథ్ యాత్ర‌…ఎక్కడంటే…?

తెలంగాణ అమ‌ర్‌నాథ్ యాత్ర‌గా పేరొందిన స‌లేశ్వ‌రం జాత‌ర నేటి నుంచి ప్రారంభం కానుంది. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శమిస్తారు.

ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ జాతర తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఏటా మూడురోజులు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుందని తెలిపారు. భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement