Sunday, May 5, 2024

Breaking: గుండెపోటుతో తహసీల్దార్ మృతి

తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుతో త‌హ‌సీల్దార్ మృతిచెందాడు. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో త‌హ‌సీల్దార్ ఫ‌రీదొద్దీన్ (52) మృతిచెందాడు. కేసముద్రం మండల తహసీల్దార్ గా పనిచేస్తున్న ఫరీదొద్దిన్ కు గుండెపోటు వచ్చింది. అయితే.. ఆయ‌న‌ను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఫరీదొద్దిన్ మృతి చెందాడు. నిన్న ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో పాల్గొన్నాడు ఎమ్మార్వో ఫరీదొద్దిన్. ఇవాళ తెల్లవారుజామున త‌హ‌సీల్దార్ గుండెపోటుతో మృతి చెందాడు. ఫ‌రీదొద్దీన్ మృతిచెంద‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement