Saturday, May 18, 2024

గిరిజన సంప్రదాయానికి ప్రతీక తీజ్ – ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

డేవరకొండ, ఆగస్టు 27(,ప్రభన్యూస్);గిరిజనుల సాంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం గుడి తండా గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీజ్ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్ పండుగ సంబురాలను రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు, తండాలలో గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. తమకు మంచి వరుడిని ప్రసాదించమని దేవుడిని వేడుకుంటూ పెళ్లీడుకు వచ్చిన యువతులు 9రోజుల పాటు నవధాన్యాలకు పూజలు చేయడం తీజ్ ప్రత్యేక అని ఆయన తెలిపారు

.ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేనావత్ అంజలిరాంబాబు,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు నేనావత్ రాంబాబు,ఎంపీటీసీ నేనావత్ రజిత,నేనావత్ శంకర్ నాయక్,మాజీ సర్పంచ్ మధు,బలరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement