Tuesday, April 30, 2024

Komaram Bheem: క‌ల‌క‌లం రేపుతున్న పులుల మ‌ర‌ణాలు… విచార‌ణ చేప‌ట్టిన అధికారుల బృందం

కొమురం భీం జిల్లాలో వ‌రుస‌గా పులుల మ‌ర‌ణాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు.

రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఐదు రోజుల క్రితం ఓ ఆడ పులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే.. ఆ రెండో పులి డెడ్ బాడీని కూడా సోమవారం గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినపుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో.. ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. మొదటి పులి మృతదేహానికి కొంతదూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది.

దరిగాం అటవీ ప్రాంతంలో 3 రోజుల వ్యవధిలోనే 2 పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా.. మూడు సంవత్సరాల వయసున్న మరో పులి సైతం మరణించింది. పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఆశ్రయం కోసమే రెండు పులులు కొట్లాడుకుని ఉంటాయని భావిస్తున్నారు. తొలుత మృతి చెందిన పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అనంతరం ఎన్‌టీసీఎ నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement