Sunday, April 28, 2024

మేడారంలో వన దేవతలను దర్శించుకున్న ఏపీ స్పీకర్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. తన ఎత్తు బంగారం వన దేవతలకు సమర్పించారు.

అంతకుముందు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏపీ స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్పీకర్‌ దంపతులను శాలువా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement