Monday, April 29, 2024

Breaking: రష్యా దాడుల్లో 112మంది చిన్నారులు మృతి

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు రష్యా భయంకరమైన దాడులకు పాల్పడుతోంది. అయితే రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో భారీగా పౌర మరణాలు నమోదవుతోన్న విషయం తెలిసిందే. పెద్దలతోపాటు చిన్నారులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement