Thursday, May 9, 2024

Breaking: వేములవాడ ఎంపీఓపై సస్పెన్షన్ వేటు.. డ్యూటీలో నిర్లక్ష్యమే కారణం!

విధుల్లో నిర్లక్ష్యం వహించడం తోపాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు వేములవాడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరేష్ ను సస్పెండ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ ఓ నరేష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఎంపీ బూర వజ్రమ్మ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

ఈ కంప్లెయింట్​పై విచారణ అధికారిగా జిల్లా పరిషత్ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిని కలెక్టర్ నియమించారు. విచారణలో విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు నిధుల దుర్వినియోగం చేసినట్టు తేలింది. దీంతో విచారణ అధికారి నివేదిక ఇవ్వడంతో నరేష్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను వేములవాడ ఎంపీడీవో శ్రీధర్ కు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement