Thursday, May 2, 2024

Tight security: కొత్త‌పాసుల జారీ నిలిపివేత‌… అసెంబ్లీకి ప‌టిష్ట భ‌ద్ర‌త‌

పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌తో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్ర‌మైంది. ఇవాళ జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలకు పటిష్ఠ భద్రత కల్పించాలని శాసనసభ ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని సూచించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆ తరహా ఉదంతాలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేలా మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను అక్బరుద్దీన్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement