సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టగా, దాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.